Mallareddy college I మల్లారెడ్డి యూనివర్సిటీ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించిన మల్లారెడ్డి... విదేశీ విద్యపై విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అలెగ్జాండర్

Mallareddy college I మల్లారెడ్డి యూనివర్సిటీ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

జయభేరి, మేడ్చల్ :

మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు రోజులు ఏర్పాటు చేశారు. బుధవారం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్‌ యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్‌లారెన్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ నూతన కార్యాలయం ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్‌లారెన్ మాట్లాడుతూ మల్లారెడ్డి విశ్వవిద్యాలయం యొక్క అంతర్జాతీయ అధ్యయన కేంద్రం పట్ల తన అభినందనలు తెలిపారు. అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, విదేశాలకు వెళ్లే విద్యార్థుల భద్రత మరియు విజయాన్ని నిర్ధారించడానికి సరైన మార్గదర్శకత్వం మరియు మద్దతు అందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆలపాటి మరియు సౌత్ ఆసియా ఆస్ట్రేలియా ట్రేడ్ కమిషన్ హెడ్ అనిత పాల్గొన్నారు. 

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ 

2a60766d-ecef-47cd-b719-d4c7560bdfe7

Read More శాయంపేట బిజేపి మండల అధ్యక్షునిగా నరహరిశెట్టి రామకృష్ణ

విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు:- మల్లారెడ్డి
మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మన తెలుగు పిల్లలు అమెరికాలో చాలా మంది ఉన్నారు. మన పిల్లలకు ఉన్న తెలివి, స్మార్ట్ నెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ప్రపంచంలో టాప్ సైంటిస్టలు కాని, టాప్ డాక్టర్స్ కాని, ఏ రంగంలో చూసుకున్న మన తెలుగువాళ్లే ఉన్నారు. అందుకే అప్లికేషన్ నుంచి, మంచి యూనివర్శిటి ఎంపిక విధానం వరకు అన్ని సక్రమంగా ఉండాలని, ఎంతో మంది మన పిల్లలు విదేశాల్లో చదివి, గొప్పగొప్ప వాళ్లు కావాలని ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. 26, 30 దేశాలలోని వారు ఏ యూనివర్శిటికి పోయినా మల్లారెడ్డి యూనివర్శిటి అందుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందని నేను మాట ఇస్తున్నాను అన్నారు. మల్లారెడ్డి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ తో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఎడ్యుకేషన్ సెంటర్ ఉపయోగ ఎంతో పడుతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని,డబ్బులు వృధా చేయకుండా కష్టపడి చదువుకొని తమ లక్ష్యాలను ఛేదించాలని సూచించారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రపంచ స్థాయిలో ఉండే అన్ని సదుపాయాలను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నామని ఈ జీవితం విద్యార్థుల అంకితం చేస్తున్నానని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. 

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

విదేశీ చదువుల కోసం సులభతరం:- శ్రీకర్ అలపాటి
విదేశాలలో చదువుకొనే విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్లకుండా అన్ని సేవలు గ్లోబల్ ఎడ్యుకేషన్ నుంచి మల్లారెడ్డి యూనివర్శిటీలో అందించడం జరుగుతోందాని శ్రీకర్ ఆలపాటి అన్నారు. ఆఫర్ లెటర్, స్కాలర్ షిప్, వీసా గురించి అందించనున్నామని ఆయన తెలిపారు. విద్యార్థి ప్రొపెల్ బట్టి స్కాలర్ షిప్ కూడా ఇస్తారు. ఫారిన్ వెళ్లే విద్యార్థులకు ఏలాంటి అంక్షలు లేకుండా 60లక్షల వరకు మేము ప్రోవైడ్ చేస్తామని, విద్యార్థులకు సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేసుకొవచ్చన్నారు. బుధవారం, గురువారం మల్లారెడ్డి యూనివర్శిటీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంటుందాని దీనిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకర్ పేర్కొన్నారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి