జయభేరి, మేడ్చల్ :
మండలంలోని రాజబొల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఘనాపూర్ గ్రామ యువకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను బాసటగా నిలిచారు. ఘనాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 30 మంది పదవ తరగతి విద్యార్థులకు రూ.10 వేల విలువ గల ఆన్ ఇన్ వన్, స్టడీ మెటీరియల్ ను పూర్వ విద్యార్థి కిరణ్, గ్రామ యువకులు భాస్కర్, ఉపేందర్, వినోద్, మనోహర్, శ్రీనాథ్, కిట్టు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు అందజేశారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.