Kamareddy I లోక్ సభ ఎన్నికలు యజ్ఞంలా భావించాలి
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :
గిఫ్ట్ వస్తువుల రవాణాపై వాణిజ్య పన్నుల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అనుమానాస్పద, ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలపై ప్రతి రోజు నివేదిక అందించాలని, అక్రమ మద్యం నిల్వలు,మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని ఆబ్కారీ అధికారులకు సూచించారు. అదేవిధంగా బస్సు ప్రయాణంలో అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచార మందించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు సూచించారు.ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుండి విస్తృత తనిఖీలు చేస్తూ గత మూడు రోజుల్లో 7.6 లక్షలు, నేడు 4.50 లక్షల నగదు తో పాటు 986 లీటర్ల ఐ ఏం.ఎఫ్.ఎల్ మద్యాన్ని పట్టుకున్నామన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో మాదిరే ఈ ఎన్నికలల్లో అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం, కానుకలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.ఎఫ్.ఓ. నిఖిత, ఆర్.టి.ఓ. శ్రీనివాస్ రెడ్డి,ఆర్.డి.ఓ.లు, రమేష్ రాథోడ్, రంగనాథ్, మన్నే ప్రభాకర్, బావయ్య, భార్గవ్ సుధీర్, ఇందిర తదితర అధికారులు, తహాసీల్ధార్లు పాల్గొన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు యువతను ప్రోత్సహించాలి. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను నూతన ఓటరుగా నమోదుతో పాటు ఓటింగ్ శాతం మరింత పెంచేలా స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలోని ఏర్పాటు చేసిన స్వీప్ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో మరో మూడు శాతం మేర 18-19 సంవత్సరాల లోపు యువతను ఓటరుగా నమోదు చేయడానికి అవకాశం ముందని, ఆ దిశగా యువతను ప్రోత్సహించి ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. మే 13న జరిగే లోక్ సభ పోలింగ్ కు నేను ఖచ్చితంగా ఓటేస్తాను అనే భావన కలిగించి ఓటింగ్ శాతం పెంచేలా చూడాలన్నారు. 12 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పని సరిగా పోలింగ్ బూతుకు తీసుకువచ్చేలా అవగాహన కలిగించాలన్నారు.
వేసవి దృష్ట్యా పోలింగ్ మొదలైన మొదటి గంటలోనే భారీగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల సహకారంతో పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఈ మాసంలో క్యాంపస్ అంబాసిడర్ల ద్వారా కళాశాలలో ఫ్యూచర్ ఓటరు దారులను ఓటర్లగా నమోదు చేయించామని, మాక్ పోలింగ్,మానవ హారం నిర్వహించామని, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించామన్నారు. మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రంగోళి పోటీలు నిర్వహించామన్నారు. ప్రతి ఓటరుకు తమ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉన్నదో (ఓటర్ హెల్ప్ లైన్, ఓటర్ ఇన్ఫర్మషన్ స్లిప్) అవవగాహన కలిగించేందుకు ఈ నెల 22న వాక్ టు పోలింగ్ బూత్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అదేవిధంగా 26న శాసనసభ సెగ్మెంట్ లో 5 కె రన్, 28 న గోడలపై ఓటు ప్రాముఖ్యత పై ఫోటోలు, స్లోగన్ పెయింటింగ్ లు వేయించ నున్నామని కలెక్టర్ తెలిపారు. నవ యువత, థర్డ్ జెండర్ లను ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని యెన్.ఎస్.ఎస్.ఎన్సీసీ, నెహ్రు యువక కేంద్రం, కళాశాల లిటరసీ క్లబ్ లను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, సభ్యులు ధర్మా నాయక్, శైలి, రామగిరి శర్మ, ఆర్.డి.ఓ.లు రంగనాథ్, రమేష్ రాథోడ్, మన్నే ప్రభాకర్, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.
Post Comment