కేంద్రంలో బీజేపీదే అధికారం
గుండ్లపోచంపల్లిలో ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం
జయభేరి, మేడ్చల్ :
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 13వ వార్డులో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి హాజరై మల్కాజిగిరి బీజేపీ ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అమరం సరస్వతి (సెన్సార్ బోర్డ్ మెంబర్), సముద్రాల హంస రాణి, దొడ్ల మల్లికార్జున్, సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, మండల రవీందర్ గౌడ్, సార కిషన్, బండారి సురేందర్, సార కృష్ణ, తప్పటి హనుమంతు, బట్టికాడి నవనీత, సుంకు నవీన్, బట్టికాడి విక్రమ్, పిడుగుల నాగరాజు, బండారి నరేష్, అరుణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


