BJP : బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది..
అహర్నిశలు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
రేవంత్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం
తగిన మూల్యం చెల్లించక తప్పదు
- ఈటల రాజేందర్
జయభేరి, షామీర్పేట :
అమిత్ షా తొలి మీటింగ్ లో 17 సీట్లలో 12 సీట్లు బిజెపి గెలవబోతుందని చెప్పారు. ఇవాళ చూసిన పరిస్థితిని బట్టి తూచా తప్పకుండా 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ప్రస్టేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపనీయంగా ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుందని ఏదైతే మాట్లాడారో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలినా.. మళ్లీ అరిగిపోయిన రికార్డు 2024 లో కూడా ఆ మాట మాట్లాడటం ఆయన అజ్ఞానానికే నిదర్శనం అని భావిస్తా ఉన్నాం. ఇలాంటి అజ్ఞానపు మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం అనేది తగదు. తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాను.
Post Comment