వెన్కేపల్లి -సైదాపూర్ మండల కేంద్రంలో భూ భారతి
కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం పై రైతులకు అవగాహన సదస్సు
సైదాపూర్, ఏప్రిల్ 29 : వెన్కేపల్లి - సైదాపూర్ మండలం భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
లక్షల పిర్యాదులు భూ సమస్యల పైవచ్చాయిఆనాడు పెద్దమనుషులుచెప్పినగౌరవంఉండే, సదాబైనమా ద్వారా ఉండే,భూమి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ ఒక దగ్గర ఉండే,ప్రజా పాలన లో భూ సమస్యలు ప్రధాన విజ్ఞప్తి గా ఉండే, భూనక్ష ద్వారా భూమిని కొలిచి ఆదార్ కార్డు భూ దార్ కార్డు ఇస్తాం,మీ భూమి నెంబర్ ఇక వేరే వాళ్ళకి ఉండదు, భూమి పేపర్లు రికార్డులు కంప్యూటర్ తో పాటు రికార్డుల్లో ఉంటాయి.2014 నుండి ఏర్పడిన ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థ నాశనం చేసింది.. విఆర్వో వ్యవస్థ తీసేసింది.
భూమికి సంబంధించిన సమాచారం లేకుండా ధరణి చుట్టు తిరిగేలా చేశారు, భూ రికార్డులు, క్రయ విక్రయాలు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పర్యావక్షించడానికి ప్రత్యేక గ్రామ రెవెన్యూ ఉద్యోగులు వస్తున్నారు.ప్రభుత్వ ఆస్తులు ప్రజల అవసరాలకు వినియోగించాల్సి ఉంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసరాలకేఉపయోగించాలిఎవరైనా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేయండి. దేవాలయ భూములు ,శిఖం భూములు అనేక రకాల ప్రభుత్వ భూములు తీసుకొని ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికీ తీసుకురండి, రెండు గుంటల భూమి కోసం వీణవంక లో అన్నదమ్ముల సంపుకునే పరిస్థితి వచ్చింది,భూ భారతి ద్వారా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా భూ భారతి చట్టం తెచ్చాం.
తెలంగాణ లో ఉన్న ఏ రైతు భూమి హక్కు సమస్య భాగంగా కావద్దని అవగాహన కల్పిస్తున్నాం, ధాన్యం కొనుగోలు ఏ గ్రామంలో ఎంత కొనుగోలు చేస్తున్నామని పర్యవేక్షణ చేస్తున్నాం, అధిక తూకంచేయడంలేదు ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3500 ఇల్లువచ్చాయి. పేదలకే ఇల్లుఇస్తున్నాం.పారదర్శకంగా ఇళ్లు ఇస్తున్నాం, గౌరవెల్లి, సర్సప్ ఫేజ్ 4 సైదాపూర్, చిగురు మామిడి మండలాల సాగునీరు కి ప్రాధాన్యత ఇస్తున్నాం, మోడల్ స్కూల్ వర్షపు నీటి సమస్య తొలగించము.మీకు ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురండి.. నేను పరిష్కారం చేస్తా, విశాల సహకార పరపతి సంఘం నూతన భవనం ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్ దొంత సుధాకర్, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోడం లింగమూర్తి, సైదాపూర్ సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, ఎం.పీ.డీ.వో భూక్య యాదగిరి, ఎమ్మార్వో దూలం మంజుల, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ.ఈ.వో వైదేహి, ఎం.పి.యo. కుమారస్వామి, అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, ముత్యాల మల్లేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Post Comment