గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్

మానవీయ కోణ ప్రకటన: డా. యం ఏ జమాన్.

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు గౌరవనీయులైన సిఎం రేవంత్ రెడ్డీ గారికి గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షలు మంజూరు చేసినందుకు ఈ నిర్ణయం చారిత్రాత్మకమైన, మానవతా కోణంలో తీసుకో బడిఉంది,

పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో, ప్రత్యేక రాష్ట్రంగా ఏ సిఎం ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ డైనమిక్ నిర్ణయం వెనుక ఎన్నారై సెల్ ఛైర్మన్ అంబాసిడర్ డా.వినోద్ కుమార్ ఎడతెగని కృషిని డా.ఎం.ఎ.జమాన్ ప్రశంసించారు. గల్ఫ్ బాధిత కుటుంబాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. డా.ఎం.ఎ.జమాన్ సెప్టెంబర్ 18న తన మీడియా ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు.

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న తెలంగాణ వ్యక్తులకు సంబంధించి తక్షణ సంక్షేమ చర్యలను ప్రకటించడం  సెప్టెంబర్ 16న జారీ చేయబడింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ యన్ ఆర్ ఐ డిపార్ట్‌మెంట్ జి వో నం.205.గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన వ్యక్తుల కోసం సంక్షేమ చర్యలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని డా.జమాన్ ప్రశంసించారు. గల్ఫ్ కార్మికులు ఏదైనా కారణం వల్ల 07-12-2023న లేదా ఆ తర్వాత అనుకొని పరిస్థితుల్లో మరణిస్తే 

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాకు అర్హులు.గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని అధ్యయనం చేయడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసి, అన్ని వర్గాల ప్రజల కు మంజూరు చేయడం అభినందనీయం అని డా.ఎం.ఎ.జమాన్ ఒక ప్రకటనలో తెలిపారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, వారి వలసలు, వారి సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి వివిధ అంశాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.

Read More TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?

ప్రత్యేక "ప్రవాసీ ప్రజావాణి" నిర్వహించడం.హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో "ప్రవాసి ప్రజావాణి" పేరుతో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక ఫిర్యాదుల కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వంలో ప్రవేశానికి ప్రాధాన్యత.

Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

రెసిడెన్షియల్ పాఠశాలలు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రవేశం కల్పించబడుతుంది. సాధారణ పరిపాలన విభాగం, ప్రణాళికా విభాగం మరియు రెసిడెన్షియల్ పాఠశాలల కార్యక్రమాన్ని అమలు చేసే అన్ని విభాగాలు తదుపరి చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారుపై కార్యక్రమాలను సమయానుకూలంగా అమలు చేస్తా రని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

Views: 1