పట్టభద్రుల ఉపఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

పట్టభద్రుల ఉపఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

జయభేరి, దేవరకొండ :
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని  దేవరకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి శ్రీరాములు అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దేవరకొండ డివిజన్లో 11626 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ అధికారి (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ), ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు) విధులు కలిపి 15 పోలింగ్ కేంద్రాలలో 60 మంది విధులు నిర్వహించనున్నారు.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా పెట్టామని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షారులవుతారని వెల్లడించారు.

Read More Telangana MP I టార్గెట్ @17

IMG-20240526-WA1764

Read More GHMC I శివ శివ.. హర హర...

Views: 0