Wedding : హైదరాబాద్ లో చక్కటి విడిది...
ఈ భవన్లో నామమాత్రపు ధరతో అంటే నలుగురికి రోజుకు రూ. 200కే వసతి కల్పిస్తున్నారు.
ముఖ్య గమనిక...Rs..."40"...వేలకే పెండ్లి మండపంతో పాటు "15" గదులు సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్ (Kachiguda Tulja Bhavan)
ఇతర రాష్ట్రాల పర్యాటకులు..
నగరం (City) నడిబొడ్డున ఉండటం, పార్కింగ్ రవాణా సౌకర్యం, తక్కువ చార్జీ ఉండటం వల్ల ఈ భవన్ మంచి ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు, వివిధ వైద్యశాలలకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులు నిత్యం ఇక్కడ బస చేస్తుంటారు. ఎక్కువగా ఏపీ (Mostly tourists from AP), బెంగళూరు(Bangalore), గుజరాత్ (Gujarat), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), మహారాష్ట్ర (Maharashtra), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), రాజస్థాన్ (Rajasthan), జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh), పంజాబ్ (Punjab), కర్ణాటక (Karnataka), హర్యానా (Haryana), గోవా (Goa) తదితర రాష్ర్టాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడే విడిది చేస్తారు. అలా వచ్చే ఆదాయంతోనే భవనాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ విడిది కేంద్రంలో తక్కువ చార్జీలతో సకల సౌకర్యాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల (rural areas) వారికి ఈ భవనం గురించి తెలియకపోవడం వల్ల వసతి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వివాహ వేడుకలకు (wedding ceremony)
శతాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులు సమకూర్చారు. మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వంటశాల గదిని నిర్మించారు. ప్రస్తుతం 18 గదులు అందుబాటులో ఉండగా, అన్నింటిల్లో బాత్రూంలను ఏర్పాటు చేశారు. ఇటీవలే పేదల సౌకర్యార్థ్ధం తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు (weddings) చేసుకోవడానికి టెంట్ సామాన్లు, 15 గదులను కేవలం రూ.40 వేల ప్యాకేజీతో ఇస్తుండటం విశేషం.
ఆలయం.. గ్రంథాలయం.. (Temple.. Library..)
ఈ తుల్జాభవన్లో పురాతన రామాలయం ఉంది. ఏటా శ్రీరామనవమి (Ramanavami) వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక యువత, నిరుద్యోగులు, (unemployed and readers) పాఠకుల కోసం గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు స్వచ్ఛంద సంస్థలు వైద్యశిబిరాలు (medical camps) నిర్వహిస్తుంటాయి.
ఎంతో మేలు...
పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ఖర్చుతో పెండ్లిండ్లు చేసుకోవడానికి కేవలం రూ.40 వేల ప్యాకేజీ ఇవ్వడం శుభసూచికం... కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజలు (middle class people) ఈ భవన్లో పెండ్లిళ్ల్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు బయట లాడ్జిలతో (lodges) పొల్చితే ఇక్కడ కేవలం రూ.200 చెల్లిస్తే నలుగురికి వసతి కల్పిస్తున్నారు...( తాటిపల్లి దేవయ్య )
అనేక సౌకర్యాలు అందుబాటులో..
నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు అందుబాటు ధరలో అంటే నలుగురికి రోజుకు కేవలం రూ.200లకే తుల్జాభవన్లో వసతి కల్పిస్తున్నాం. వివిధ పనుల కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ వసతి పొందడానికి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరం నడి బొడ్డున ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉన్నది. వసతి పొందాలనుకునే వారు -94910 00687, 83094 81306 నంబర్లలో సంప్రదించవచ్చు.
-ఎ. బాలాజీ (దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, కాచిగూడ తుల్జాభవన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)
గమనిక: వీలైనంత ఎక్కువ ఈ మెసేజ్ సర్క్యులేట్ చేయండి... అవసరమైన వారికి ఉపయోగ పడుతుంది...
Post Comment