యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు

జయభేరి, తాడేపల్లి :

యువత మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండాలని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు సూచించారు. ఆదివారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మాట్లాడారు మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. గంజాయిఫై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిఐ తెలిపారు. గంజాయి రహిత తాడేపల్లిగా చేయాలన్నదే తమ ధ్యేయమని అన్నారు.

Read More రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

గంజాయికి బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొంటుందని, దాని వల్ల తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి రహిత తాడేపల్లి కోసం కృషి చేస్తామన్నారు.

Read More Telangana : బై బై హైదరాబాద్!

Views: 3

Related Posts