Movie 1920 Beemunipatnam I రాజమండ్రి పరిసరాల్లో "1920 భీమునిపట్నం"

అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ బ్యానర్‌పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న సినిమా

Movie 1920 Beemunipatnam I రాజమండ్రి పరిసరాల్లో

అపర్ణాదేవి కంచర్ల ఉపేంద్ర కథానాయికగా నటించిన చిత్రం "1920 భీమునిపట్నం".. అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ బ్యానర్‌పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పది రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్ర యూనిట్ రాజమండ్రి వెళ్లి హీరో హీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ.. ‘‘రాజమండ్రిలోనూ పది రోజుల పాటు షూటింగ్‌ చేస్తాం. గోదావరి నేపథ్యంలో హీరో, హీరోయిన్ల సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో సీతారాం, సుజాత పాత్రల మధ్య జరిగే ప్రేమకథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. కథ ప్రకారం సంగీతం, ఫోటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. రాజమండ్రి తర్వాత విశాఖపట్నం, అరకు, ఊటీల్లో కూడా షూటింగ్‌ చేస్తాం’’ అన్నారు.

Read More Korutla is the home of arts I కోరుట్ల కళలకు నిలయం

దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.. ‘‘భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో చక్కటి ఎమోషనల్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పాత్రలన్నీ సహజంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కాగా హీరో కంచర్ల ఉపేంద్ర. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పోలీసు అధికారి పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ స్వాతంత్ర్య సమరయోధుడి కూతురిగా నటిస్తోంది. అపర్ణా దేవి కనిపించనుంది" అని అన్నారు. 

Read More Highest Grossing movies in 2024 : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..

హీరో కంచర్ల ఉపేంద్ర, కథానాయిక అపర్ణాదేవి మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన పీరియాడికల్ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా అరుదు.. ఎందుకంటే ఇలాంటి కథ, అదే స్థాయిలో తెరకెక్కించగల దర్శకుడు, రాజీపడని, ప్యాషనేట్ ఉన్న నిర్మాత, ఇలాంటి సినిమా. కలిసి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సినిమాలో నటించడం మా అదృష్టం."
ఈ చిత్రంలో యండమూరి ప్రవీణ్, కోలా శ్రీనివాస్, పవిత్రా లోకేష్, తిలక్, జెన్నీ తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. పాత, కొత్త నటీనటులు నటిస్తున్నారు. సంగీతం: ఇళయరాజా, సినిమాటోగ్రఫీ: ఎస్.మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: సురేష్ భీమగాని, సహ నిర్మాతలు: కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, నిర్మాత: కంచర్ల అచ్యుతరావు, రచన, దర్శకత్వం: నరసింహ నంది

Read More Movie : పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్‌పై మండిపడ్డ నటి కస్తూరి

Views: 0

Related Posts