సరైన పరిహారం ఇచ్చి భూనిర్వహితులను ఆదుకోండి
రైతుకు ఎకరాకు పది లక్షలు ఇచ్చి కోట్లుకు అమ్ముకున్నారు... హామీలను అమలు చేయండి లేదంటే పరిశ్రమలను నడవనీయం
జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24:
పేదల భూములను ఫుడ్ ప్రాసెసింగ్ కోసం భూసేకరణ జరిపిన గత ప్రభుత్వం, కోట్లు విలువ చేసే రైతుల భూములను నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని రెండవ రోజు పరిశ్రమల వద్ద రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ లో నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద మంగళవారం రైతులు నిరసన తెలుపుతూ రైతులకు రికార్డు ప్రకారం ఉన్న భూములకు సైతం సరైన పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేశారని భూనిర్వాయితులు పరిశ్రమల వద్ద ఆందోళన చేసి చేస్తున్న పనులను నిలిపివేశారు.
Views: 0


