Nita Ambani : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..
నీతా అంబానీ ప్రతి సంవత్సరం బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు.
నీతా అంబానీ నిన్న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. నిన్న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ముఖేష్ అంబానీ భార్య అమ్మవారిని దర్శించుకున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీలోని ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నీతా అంబానీ ప్రతి సంవత్సరం బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ముంబై ఇండియన్స్ ఓనర్గా కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా బుధవారం ఉప్పల్లో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.. నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే విజయం ఖాయమని ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా నమ్ముతున్నారు.
హైదరాబాద్లోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చారని ప్రతీతి. ఎల్లమ్మ తల్లిని కలియుగ దైవంగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా నిలిచి ఉంది. బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు ఆమెను పరశురాముని తల్లిగా భావిస్తారు.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment