Minister Ponguleti Srinivasa Reddy : వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు..

చెన్నై కస్టమ్స్‌ అధికారుల నోటీసులు

Minister Ponguleti Srinivasa Reddy : వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనయుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు నోటీసులు అందించారు.

పొంగులేటి కుమారుడు హర్ష పటేక్ ఇటీవల ఫిలిప్ మరియు బ్రిగిట్టే బ్రాండ్‌ల నుండి రెండు లగ్జరీ వాచీలను ఆర్డర్ చేశాడు. భారత్‌లో అందుబాటులో లేని ఈ బ్రాండ్లను తీసుకురావడానికి నవీన్ కుమార్ ఓ వ్యక్తి సహాయంతో ముబిన్ అనే స్మగ్లర్‌ను సంప్రదించాడు. హర్ష కోసం ముబిన్ సింగపూర్ నుంచి ఆ రెండు వాచీలు తెప్పించాడు. ఈ వాచీల విలువ ఒక్కోటి రూ.1.75 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కానీ ఈ వాచీలకు హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు సమాచారం. చెన్నై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నవీన్ కుమార్ ను విచారించిన చెన్నై కస్టమ్స్ అధికారులు తాజాగా హర్షకు కూడా నోటీసులు జారీ చేశారు.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

368164-ponguletis-son-harsha-reddy

Read More School I శ్రీ చైతన్య పాఠశాలలొ వైజ్ఞానిక, సాంస్కృతిక,  క్రీడా ప్రదర్శన

ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించింది.కానీ తనకు ఆరోగ్యం బాగోలేదని, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష బదులిచ్చారు.ఇదిలా ఉండగా అక్రమంగా తరలిస్తున్న వస్తువుల రూపంలో తీసుకొచ్చిన మొత్తం వాచీల స్కామ్ విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

Views: 1