Manne Krishank I ఈ ఫోటో తప్పు అని నిరూపించగలరా?

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు...

Manne Krishank I ఈ ఫోటో తప్పు అని నిరూపించగలరా?

జయభేరి, హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూకబ్జాకు పాల్పడిన అనుముల మహానంద రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలడా..? క్రిశాంక్‌ సవాల్‌ విసిరారు. ఈ భూకబ్జా పోస్ట్ చేసినందుకు మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూములిచ్చిన అనుముల మహానంద రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉందని ఆధారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కోర్టుకు వచ్చి ఇది తప్పని నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. అతనెవరో మాకు తెలియదని.. తామెప్పుడూ చూడలేదని వాదిస్తున్నారు. వాడు తెలియకపోతే, చూడకపోతే ఈ ఫోటోలు ఎలా వస్తాయి..? రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ.. కోర్టుకు రండి.. ఈ ఫోటో తప్పని నిరూపిస్తారా..? సుప్రీంకోర్టు, హైకోర్టు.. ఏ కోర్టుకైనా వెళ్దాం అని క్రిశాంక్ సూచించారు.

మనమే కాదు.. చిత్రపురి సాధన సమితి కూడా గతంలో ఈ భూసేకరణను ప్రశ్నించింది. ఈ భూ కబ్జాలపై చిత్రపురి సాధన సమితి మాజీ గవర్నర్ తమిళిసైకి ట్వీట్ చేసింది. రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. చిత్రపురి నగరంపై కూడా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఏం అడిగినా మళ్లీ అడిగినందుకు మాపై కేసు నమోదు చేశారు. ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మన్నె క్రిశాంక్‌ తెలిపారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి