LIQUOR SCAM Kavitha : నేడు కోర్టులో హాజరు.. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం

• బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం

LIQUOR SCAM Kavitha : నేడు కోర్టులో హాజరు.. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం
  • కవితకు మూడు ప్రశ్నలు వేసిన ఈడీ..!
  • మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నించింది. కవితతో పాటు విచారణను హోలీ సందర్భంగా వాయిదా వేస్తారు
  • శరణ్ పాత్ర ఏమిటి?
  • ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎంత డబ్బు చేతులు మారింది?
  • BRS MLC కవితపై ED అధికారుల ప్రశ్నల వర్షం
  • 23న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నించింది. హోలీ సందర్భంగా విచారణ వాయిదా పడుతుందని కవితతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. అయితే సోమవారం కస్టడీకి చివరి రోజు కావడంతో ఆమె నుంచి రాబట్టే సమాచారంపై ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా.. ఈ వ్యవహారంలో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్ర ఏంటి? డబ్బులు ఎలా చేతులు మారాయి? ఎవరి మధ్య లావాదేవీలు జరిగాయి? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇతర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించింది. అలాగే.. కవిత, ఆమె భర్త అనిల్, వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న మూడు ఫోన్ల డేటాను కవిత ఎదుట విచారించగా, ఆ సమాచారం ఆధారంగా మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, కవితను ఇప్పటికే రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు.. మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు మరోసారి రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరో ఐదు రోజుల పాటు ఆమెను రిమాండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

బెయిల్ పిటిషన్‌పై..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొంటూ కవిత ఈ నెల 23న రూస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈడీ కోరినట్లు కవితను కస్డాడికి ఇస్తారా? జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారా? లేక బెయిల్‌పై విడుదల చేస్తారా? అన్నది మంగళవారం వెల్లడికానుంది. కాగా, సోమవారం రాత్రి 7 గంటలకు లాయర్ మోహిత్ రావు భర్త అనిల్‌తో కలిసి కవితను కలిశారు. మంగళవారం కోర్టు ముందుకు రానున్న బెయిల్ పిటిషన్‌పై చర్చించినట్లు తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి? బెయిల్ నిరాకరిస్తే భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ 

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి