కెసీఆర్, హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

  • భగ్గుమన్న కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు..
  • రవాణా ఖర్చులు 50 వేల రూపాయలు ఇచ్చామన్న హరీష్ రావ్ !
  • మాకు అందలేదన్న భూ నిర్వాసితులు..! 
  • ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లినట్లు ?
  • రచ్చబండకు హరీష్ రావ్ ను ఆహ్వానించిన కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు 

కెసీఆర్, హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

జయభేరి, గజ్వేల్ ములుగు, అక్టోబర్ 23 :
మాజీ మంత్రి హరీష్ రావ్ గజ్వెల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఎంతో చేశాము కుటుంబానికి 7లక్షల 50 వేల రూపాయలు ఇచ్చామని , 18 సంవత్సరాలు నిండిన వారికీ 250 గజాల ప్లాటు ఇచ్చామని , అలాగే దారి ఖర్చులకు 30 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఇచ్చామని హరీష్ రావు అన్నారు. 

అందుకు నిరసనగా కొండపోచమ్మ సాగర్ ఆర్అండ్ఆర్ కాలనీ మామిడ్యాల బహిలింపుర్ తానెదర్ పల్లి నుండి నిర్వాసితులు అందరు కలిసి కేసీఆర్ ,హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనంచేసి నిరసన తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు మమ్మల్ని మోసం చేశారని నమ్మిన మమ్మల్ని నట్టేట ముంచారని వారు ఎద్దేవా చేశారు. దారి ఖర్చులకు 50 వేల రూపాయలు ఇస్తే అవి ఎవరి జేబులోకి పోయాయని నిర్వాసితులు అడుగుతున్నారు మీ పార్టీ లీడర్ల జేబులోకి వెళ్ళాయా లేదా ముంపు గ్రామాలలో ఇల్లులు ఖాళీ చేయించినందుకు వారికి ఆ డబ్బులు ఇచ్చారా అని అడిగారు. మాకు రవాణా ఖర్చుల కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆ డబ్బులు ఇప్పటికైనా మాకు ఇప్పించాలని హరీష్ రావును నిర్వాసితులు కోరారు.

Read More యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

ఒకవేళ ఆ డబ్బులు ఇప్పించకపోతే మేము నిరసన ఉదృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరించారు. ఊర్లో నుండి చాలా సంవత్సరాల క్రితం వెళ్లిన వారికి కూడా ప్లాట్లు ఇల్లులు ఇప్పించారని నిజమైన నిర్వాసితులకు మొండి చేయి చూపించారని వారు బాదను వ్యక్తం చేశారు.  ఒంటరి మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 750000 ఇస్తామని చెప్పి కొంతమందికి ఇంకా ఇవ్వలేదని అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా నెల రెండు నెలలు తక్కువ ఉన్నా కూడా వారికి ప్యాకేజీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 

Read More మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

టిఆర్ఎస్ నాయకుల బంధువులకు సన్నిహితులకు రోడ్డు పక్కనే ఇల్లులు ఇచ్చి వారికి సహకరించారని ,నిజమైన నిర్వాసితులకు వారు ఏం చేయలేదని వారు అన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని లేకపోతే నిరసన ఉధృతం చేస్తామని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిడ్యాల తాజా మాజీ సర్పంచ్ నాగరాణి శ్రీనివాస్ గౌడ్, రాజు యాదవ్, శ్యాంసుందర్ రెడ్డి, శేఖర్, ప్రభాకర్ గుప్తా, కరుణాకర్ గౌడ్, ఎర్రోళ్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు

Read More ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక 

Latest News