ఆర్థిక అక్షరాస్యత దిశగా అందరూ అడుగులు వేయాలి... డీఆర్ డీవో సాంబశివరావు
- మేడ్చల్ జిల్లా ఉద్దమర్రి లో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన
- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జయభేరి, మే 21:
ఆర్థిక అక్షరాస్యత ను పెంపొందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ బ్యాంకులు అందిస్తున్న సేవల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారి సాంబశివరావు అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక చేకూర్పులో భాగంగా ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లో పెంపొందించడానికి ఆర్థిక మోసాలను అరికట్టడానికి, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ఎస్ ఎస్ టీ జిల్లా కోఆర్డినేటర్ అంబిక, కీసర సి ఎఫ్ ఎల్ విశ్వనాథ్ లు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్ సింగ్, బిపిఎం రమేష్, షరీఫా, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0


