పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి... సీఎం రేవంత్ రెడ్డి
వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35శాతానికి పెరిగాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆరెస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీ కి బదిలీ చేశారు. రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారు. వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ కేసీఆర్ బీజేపీని గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బీఆరెస్ ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయింది.
2023లో 13శాతం ఓట్లున్న బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతంకు ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో బీఆరెస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ బీజేపీకి తాకట్టు పెట్టారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ ఆరాచకానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలిచారు. బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టేది లేదు. వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆరెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆరెస్ ను ప్రజలు తిరస్కరించారు. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆరెస్ కు సూచన చేస్తున్నా.
హరీష్... ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారు. మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయింది. మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. దేశ ప్రజలు మోదీని తిరస్కరించారు. తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు. విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుంది. ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలి.
ఇప్పటివరకు 18 గంటలే పనిచేసాం.. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తాం.. రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదే.. వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేస్తున్నాడు.. బీఆరెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు... ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అన్న బీజేపీ... బీఆరెస్ తో ఎలా జతకడుతుందో చూడాలి... ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం.. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
Live: Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy addresses the media at CM Residency https://t.co/088w8YGtYx
Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు— Revanth Reddy (@revanth_anumula) June 5, 2024
Post Comment