కొల్తూర్ గ్రామంలో స్వచ్చదనం - పచ్చదనం
స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి - నీరజ
జయభేరి, ఆగస్టు 9:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాతకంగా చేపడుతున్న స్వచ్చదనం పచ్చదనం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఈవో నీరజ పిలుపునిచ్చారు.. స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామంలో నిర్వహించిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో నీరజ ఎంపీడీవో వత్సలాదేవితో కలిసి పాల్గోన్నారు. అదేవిదంగా గ్రామంలో పర్యటించి ఇంటింటి ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు. ఇక అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అడిగి తెలుసుకున్నారు.
Views: 0


