జగిత్యాల :
పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వరా స్వామి, వీరమ్మ బోనాల పండుగ ఉత్సావాలు, బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు.
ఈ బోనాల ఉత్సవాల్లో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని బోనం ఎత్తుకొని మహిళలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ ప్రజల అందరిని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చూడాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ కౌన్సిలర్లు వారణాసి మల్లమ్మ తిరుమలయ్య, మహిళలు, బేడ బుడగ జంగం సంఘ నాయకులు, రజక సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.