ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం..ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం..ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇబ్రహీంపట్నం :
ఎన్టీటీపీఎస్ ఐదో దశ ప్లాంట్ లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు  మరమ్మతులు ప్రారంభించారు. అకస్మాత్తుగా డోర్ లు ఓపెన్ అయి వేడి యాష్, మంటలు బయటకు వచ్చాయి.

ఆ సెగలతో  ఒక ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని  అధికారులు చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ  40 శాతానికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదో దశ ప్లాంట్ లో భద్రతా వైఫల్యంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

13 (1)

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

Views: 0