వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

  • ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న దాతలు 
  • శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి

వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

జయభేరి. గజ్వేల్, అక్టోబర్ 06 :
దాతలు, భక్తుల సంపూర్ణ సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యపడిoదని వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. ఆదివారం తున్కిమక్త తాజా మాజీ సర్పంచ్ ఎల్కoటి సంతోష వెంకటేష్ రూ లక్షా 11 వేలు ఆలయ అభివృద్ధి నిమిత్తం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు సంతోష వెంకటేష్ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ముఖ్యంగా ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వర్గల్ క్షేత్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతున్న వర్గల్ క్షేత్రం వద్ద నిత్యం వేదగోష వినిపిస్తుండగా, నిత్యాన్న దానం, సామూహిక అక్షర శ్రీకారం, గోశాల ఏర్పాటు తదితర కార్యక్రమాలు ఆలయ ప్రత్యేకతగా నిలుస్తున్నట్టు చెప్పారు.

Read More Rasi Phalalu | 28-03-2024 రాశి ఫలితాలు

ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన శంభూగిరులపై ఆలయ సముదాయ నిర్మాణం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రతినిత్యం పండగ వాతావరణం నెలకొంటుండగా, అమ్మవారి క్షేత్ర వైభవం నాలుగు దిశలా వ్యాపించి భక్తుల కొంగుబంగారంగా ఆలయ సముదాయం విలసిల్లుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో వర్గల్ క్షేత్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఏకైక లక్ష్యమని, గత మూడు దశాబ్దాలుగా వివిధ రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ రుణపడి ఉంటుందని వివరించారు.

Read More Rasi Phalalu : ఏప్రిల్ 2, నేటి రాశి ఫలాలు 02-04-2024

Views: 0