ప్రజ్వల్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు కిడ్నాప్!
- జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రసలీల కీలక పనిమనిషి కిడ్నాప్కు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జయభేరి, బెంగళూరు, మే 3 :
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రసలీల కీలక పనిమనిషి కిడ్నాప్కు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైసూరు జిల్లా కేఆర్ సిటీ పోలీసులకు ఆమె కుమారుడు ఫిర్యాదు చేయడంతో గురువారం రాత్రి ప్రజ్వల్తో పాటు అతని తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఏప్రిల్ 29 రాత్రి నుంచి తన తల్లి కనిపించడం లేదని బాధితురాలి కుమారుడు (20) పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన తల్లి 2015 నుండి ఆరేళ్లు హోలెనరసీపురలోని రేవణ్ణ ఇంట్లో పని చేస్తుందని, ఆమె మూడేళ్లలోపే ఉద్యోగం మానేసిందని వివరించాడు. క్రితం ఇక్కడ కూలీగా పనిచేస్తున్నాడు.
Views: 0


