AP Vote : మీ ఓటు ఎవరికి...

వైఎస్ హంతకులుకా.. నాకా.. షర్మిల ప్రశ్న...

AP Vote : మీ ఓటు ఎవరికి...

జయభేరి, కడప, ఏప్రిల్ 12 :
హంతకులకు సీటు ఇచ్చినందుకే కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు, అన్యాయం మరోవైపు, ధర్మపోరాటం ఒకవైపు, డబ్బు, అధికారం మరోవైపు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిల గెలుస్తారో లేదో ప్రజలే తేల్చాలన్నారు. పులివెందులో సునీతతో కలిసి ప్రచారం నిర్వహించారు. న్యాయం ఒకవైపు..అధర్మం ఒకవైపు..ధర్మ పోరాటం ఒకవైపు... డబ్బు, అధికారం ఒకవైపు. న్యాయం కోసం పోరాడే షర్మి గెలుస్తుందా? హంతకుడు అవినాష్ రెడ్డి గెలుస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. వైఎస్ఆర్, వైఎస్ వివేకాలకు ప్రజలే తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజలే తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చిందని షర్మిల అన్నారు.

వైఎస్ఆర్, వైఎస్ వివేకా ఆత్మ క్షోభిస్తోందని, సొంత తండ్రిని నరికితే అన్నయ్య జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్, వివేకానంద రెడ్డిలు ఈ జిల్లా బిడ్డలని, మేము కూడా మీ ఇంటి బిడ్డలమని షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌కు ఈ నేలపై ఎంతో ప్రేమ ఉందని, ఆయన జీవించి ఉన్నంత కాలం ఇక్కడి ప్రజల కోసమే జీవించారని అన్నారు. తాను ఉన్నంత కాలం ఇక్కడి ప్రజలకు సేవ చేశానన్నారు. వివేకానందరెడ్డి కూడా ఇక్కడి ప్రజలకు సేవ చేశారు. - వైఎస్ఆర్, వివేకా లాంటి నేతలు మళ్లీ దొరకడం కష్టం. తన తండ్రి వివేకానందరెడ్డి గొడ్డలి దాడులకు గురయ్యారని తెలిపారు. వివేకానందరెడ్డి చనిపోయి ఐదేళ్లు గడిచినా హంతకులకు శిక్ష పడలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా ఆత్మ కూడా ఘోషిస్తున్నదని అన్నారు. హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా..ఇప్పటి వరకు శిక్ష పడని హంతకులను సీఎం జగన్ స్వయంగా కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు.

Read More రైతు, కార్మికుల సమస్యలపై దేశ వ్యాప్త ఆందోళన జయప్రదం చెయ్యండి 

ys-vijayamma-jagan-vijayamma-1-1703744918

Read More ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.

హంతకులను రక్షించే అధికారం ప్రజలు ఇచ్చారా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లలేదని, బయట హంతకుడిగా తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని అన్నారు. అన్యాయంపై పోరాడేందుకే ఎంపీగా నిలబడ్డానని, ఓ వైపు వైఎస్ఆర్ బిడ్డ అని, మరో వైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి అని.. ధర్మాన్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపీలుగా గెలిచిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ప్రజల కోసం పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు ఉన్నారా.. అన్యాయం వైపు ఉన్నారో చెప్పాలన్నారు. ప్రజలు ఇంకా ఆలోచిస్తున్నారు. తప్పు చేసిన వాళ్లు భయపడుతున్నారని, తప్పు చేయకుంటే ఎందుకు భయపడతారని సునీత ప్రశ్నించారు. సునీత మాట్లాడుతూ షర్మిల ధర్మం పక్షాన నిలిచి ప్రజలను గెలిపించాలని కోరారు.

Read More రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం

Latest News

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

Social Links

Related Posts

Post Comment