ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ

ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ

జయభేరి, పరవాడ :
మండల కేంద్రం పరవాడ శివాలయం రోడ్డులో గల అయ్యప్ప స్వాముల పీఠం పీఠాధిపతి గురుస్వామి బండారు శ్రీను పెట్టుకున్న అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా జరిగింది.

అరటిడొప్పలతో తన పీఠం స్వాముల సహాయంతో తానే స్వయంగా అయ్యప్ప సన్నిదానాన్ని,పడిమెట్లను ఏర్పాటు చేసి రకరకాల పుష్పాలతో సన్నిదానాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అందులో శివ పార్వతులు, గణేష్, సుభ్రమణ్యస్వామి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేసి కుందులతో దీపారాధన,నైవేద్యాలను సమర్పించి అయ్యప్ప శరణుఘోషలతో గురుస్వామి నాయుడు స్వామి మంత్రోశ్చరణలతో సన్నిదానంలో ని దేవతామూర్తులకు పూజపెట్టిన పీఠాధిపతి శ్రీను స్వామితో  పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప విగ్రహానికి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, విభూది, నారికేల జలాభిషేకాలు నిర్వహించారు. 

Read More మద్యం ధరలపై ఏపీలో చట్ట సవరణ..

image0 (2)

Read More భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

అనంతరం సన్నిదానంలో ప్రతిష్టించిన దేవతామూర్తుల భక్తి గీతాలను అయ్యప్ప మాలధారకులు హుషారుగా ఆలపించారు.చివరగా నక్షత్ర హారతిని వెలిగించి అయ్యప్పకు సమర్పించిన పిదప శ్రీను స్వామి ఏర్పాటు చేసిన అల్పాహారం(సద్ది) ను స్వాములు బెత్తాయించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ ఎస్ అప్పలనాయుడు, గురుస్వాములు గండి సన్నిబాబు, తేలు చలపతిరావు, జంగాల త్రినాధరావు, బండారు సతీష్, అల్లంపల్లి శివ, బండారు రామారావు, స్వామిలు, బండారు శ్రీను స్వామి కుటుంభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More 79వ వార్డు పరిధి సమస్యలుపై కార్పొరేటర్ రౌతు అధికారులతో పరిశీలన 

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం

Social Links

Related Posts

Post Comment