AP Govt.. Geethanjali Family I గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం... రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన!

తెనాలి మహిళ గీతాంజలి మృతి కేసు ఏపీలో సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

AP Govt.. Geethanjali Family I గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం... రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన!

జయభేరి, హైదరాబాద్ : 

తెనాలి మహిళ గీతాంజలి మృతి కేసు ఏపీలో సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే గీతాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మేరకు సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ ట్వీట్చేశారు.

Read More YCP Puttaparthi : పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీదెబ్బ

తెనాలి మహిళ గీతాంజలి మృతి కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్రమంలో గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్జగన్ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ వెల్లడించారు. మేరకు ట్వీట్ చేశారు.

Read More PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!

సోదరి గీతాంజలి విషాద ఘటనను గౌరవనీయులైన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. దిగ్భ్రాంతికి గురైన ముఖ్యమంత్రి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. తల్లి లేని లోటు తీర్చుకోలేక పోయినా 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పసిపాపలు. స్పందించి అండగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అని సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ ట్వీట్ చేశారు.

Read More TDP Chandrababu I ఎన్డీయేలో అందుకే చేరాం...

గతంలో గీతాంజలి మృతిపై మరో ట్వీట్చేశాడు. ‘‘ అమాయకపు పసికందులను చూస్తుంటే చాలా బాధగా ఉంది.. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన బిడ్డలను అనాథలుగా చేసి, పేగులు తెంచుకుని వెళ్లిపోయిన తల్లి.. పడ్డ మానసిక వేదన భరించలేనిది.. కష్టాన్ని పగ భరించకు. చిన్నారులను ఆదుకోవడమే నివాళి. విషాదాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అంటూ హరికృష్ణ ట్వీట్ చేశారు. గీతాంజలి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి రూ.20 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

Read More AP Vote : మీ ఓటు ఎవరికి...

మరోవైపు తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలికి ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇంటిస్థలం పట్టా మంజూరు చేసింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా గీతాంజలి పట్టా అందుకున్నారు. సంతోషంలో ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. అయితే వ్యాఖ్యలను టీడీపీ, జనసేన ట్రోల్ చేయడం వల్లే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనల వాదన మరోలా ఉంది. మార్చి 8 గీతాంజలి ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్గా మారిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మార్చి 7 ప్రమాదం జరిగింది.

Read More Cm Jagan : జగన్ కూతుళ్ల భారీ పెట్టుబడులు

గీతాంజలి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గీతాంజలిని రైలు ఢీకొన్న రోజు ఏం జరిగిందన్న కోణంలో విచారణ జరుగుతోంది.

Read More DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం.. 

Views: 0

Related Posts