KCR : కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి కష్లాల్లేవ్
కాంగ్రెస్ వచ్చాకే కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయి
- కాంగ్రెస్ వచ్చిన వెంటనే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు... చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
జయభేరి, చిన్నకోడూర్, ఏప్రిల్ 21:
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులకు కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. కేంద్రంలో 15 రోజులుగా ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని హరీశ్ రావుకు తెలిపారు. వ్యవసాయ బావుల మోటార్లు కాలిపోయాయా అని హరీశ్ను ప్రశ్నించగా.. రెండు మోటార్లు కాలిపోయాయని ఓ రైతు తెలిపాడు. రైతులు అధైర్యపడవద్దని, అధికారులతో మాట్లాడి వెంటనే కలప కొనుగోలు చేసేలా చూస్తామని హరీశ్రావు తెలిపారు. తొందరపడి తక్కువ ధరకు విక్రయించవద్దని, మద్దతు ధర రూ.2,200 ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు కాలిపోయాయని, రైతుబంధు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


