పీహెచ్సీలో పశువుల సంచారం

కొరవడిన పారిశుద్ధ్యం

పీహెచ్సీలో పశువుల సంచారం

మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశువుల సంచార నిలియంగా మారింది. పారిశుద్ధ్యం కొరవడంతో పశువులు ఆరోగ్య కేంద్రం ఆవరణంలో సంతరిస్తున్నాయి.

నిత్యం రోగులు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నప్పటికీ..పశువులతో బాధితులు అవస్థలకు గురి అవుతున్నారు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాస్తా పశువుల వైద్యశాలగా మారింది. ఇక్కడ సిబ్బంది తమ పరిసర ప్రాంతాలలో పారిశుధ్య చర్యలు తీసుకోకపోవడంతో అనర్ధాలు మొదలైనట్లు బాధిత రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?

ఆ ఆస్పత్రి ఆవరణంలోనే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టని వైద్య సిబ్బంది జనాలకు తమ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని హిత బోధ చేయడం విడ్డూరంగా ఉందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే క్రమం ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అందరికీ వైద్యం, పారిశుధ్యం సమస్యలు తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 0