జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :
కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ తిరుపయ్య, వారి సిబ్బంది.మాచారెడ్డి పోలీసు వారు కలిసి భవానీపేట్ తండా చెందిన మాలోవత్ మోహన్ ఊరు శివారులో గల వైకుంట ధామము లో ఉన్న రూమ్ లో సుమారు 29 క్వింటాల పిడిఎస్ రైసును అక్రమంగా నిలువ ఉంచారు. అని సమాచారం రాగా వారి సిబ్బందితో వెళ్లి పట్టుకోవడం జరిగింది. మాలోవత్ మోహన్ పైన మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది. జిల్లాలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైసు ను తరలించిన, అధిక ధరలకు అమ్మిన, నిల్వ ఉంచిన చట్టరీత్యా చర్యలు తప్పవు అని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. 
