teachers : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి
- పి ఆర్ సి చైర్మన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి
- సానుకూలంగా స్పందించిన పి ఆర్ సి చైర్మన్ శివశంకర్
జయభేరి, మే 16:
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ బీఆర్ భవన్ లో పి ఆర్ సి చైర్మన్ శివశంకర్ ను మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఉపాద్యాయ సమస్యలపై పిఆర్టియు యూనియన్ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్ సి లో అమలు చేయాల్సిన విషయాలపై పూర్తి నివేదికను అందజేశామని చెప్పారు. మాస్టర్ స్కేలు 34,200- 292800 గా నిర్ణయించాలని, ఫిట్మెంట్ 45 శాతంగా నిర్ణయిస్తూ డిఏ 01/07/2023 33.67 శాతంగా ఫిట్మెంట్ చేయాలన్నారు. హెచ్ఎర్ఎ పరిధిని జిహెచ్ఎంసి నుంచి ప్రస్తుతం ఉన్న 8 కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లు వరకు పెంచాలన్నారు. 398 సమానవేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్ సర్వీస్ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుకు సిఫారసు చేయాలన్నారు.
Views: 0


