Delhi Liquor Scam I ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్... నేడు విచారణ..

కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది.

Delhi Liquor Scam I  ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్...  నేడు విచారణ..

జయభేరి, న్యూఢిల్లీ:

ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. కవిత కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తరఫు న్యాయవాది ఆన్‌లైన్‌లో పిటిషన్‌ వేశారు. జస్టిస్ బేల ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది.

Read More Telangana : బీజేపీ దూకుడు.. ఆపరేషన్ లో కాంగ్రెస్

ఢిల్లీ లిక్కర్ కేసు మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత గతేడాది మార్చి 14న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం వేసిన పిటిషన్‌తో పాటు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కలిపేసింది. CrPC సెక్షన్ 160 ప్రకారం, మహిళలను ఇంట్లోనే విచారించాలి, కానీ ED అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు విచారణలు చేపట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 15న కవితకు ఈడీ సమన్లు జారీ చేసిందని కవిత తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రస్తావించగా, 10 రోజుల పాటు సమన్లు జారీ చేయబోమని ఈడీ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సెప్టెంబర్ 15న తెలిపారు.

Read More Himanta Biswa Sarma : అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారు...

ఆ తర్వాత... పలు విచారణలు జరిగినా... ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే బెంచ్ వాయిదా వేసింది. తాజాగా... ఈ నెల 15న జస్టిస్ బేల మ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు కవిత పిటిషన్ విచారణకు వచ్చింది. ముందుగా ఈడీ ప్రస్తావించగా... కవిత పిటిషన్ ఈ నెల 15న విచారణకు వచ్చింది.

Read More Tech layoffs this week : బైజూస్, ఆపిల్, అమెజాన్ ల్లో ఉద్యోగుల తొలగింపు..

నాన్ మిసిలేనియస్ డే పాటించాలని ముందుగానే నిర్ణయం తీసుకోవాలని కవిత తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. దీని ప్రకారం తదుపరి విచారణ జరపాలి. అయితే కవిత తరఫు న్యాయవాదుల అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రతిసారీ ఏదో ఒక సాకుతో పిటిషన్‌పై విచారణ జరగడం లేదని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. ఇప్పుడు కూడా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏఎస్జీ రాజు తెలిపారు. పదే పదే వాయిదా కోరితే... కనీసం నోటీసు ఇచ్చేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని రాజు అన్నారు.
ఎస్వీ రాజు మాట్లాడుతూ గతంలో నోటీసులు ఇచ్చామని, 10 రోజులు గడువు ఇస్తామని చెప్పారన్నారు. కవిత తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Read More HOUSE PRICES : ఇళ్ల ధరలు పడిపోతున్నాయి

సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడిన రోజు (ఈ నెల 15) సాయంత్రం కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 16వ తేదీన కవితను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, ఈడీ అధికారులు వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టులో ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఈడీ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, తనను అరెస్ట్ చేశారని కవిత నిన్న మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రెండు పిటిషన్లను కోర్టు ఈరోజు కలిపి విచారించే అవకాశం ఉంది.

Read More Kavitha will be Produced in the Rouse Avenue COURT TODAY I రూస్ అవెన్యూ కోర్టులో కవితను అధికారులు హాజరుపరచనున్నారు...

Views: 0

Related Posts