రవాణా రంగ డ్రైవర్లు,కార్మికులరా మే 20 సమ్మె జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టి పిలుపు
జయభేరి, పరవాడ:
దేశ ఆర్థిక వ్యవస్థలో రోడ్డు రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఈ రంగంలో పనిచేసే ఆటో, మోటర్, బస్, లారీ, వ్యాన్లు ద్వారా ప్రయాణికులను సరుకులను చేరవేస్తున్నారని వీరి సమస్యలు పరిష్కారానికి మే 20వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని డ్రైవర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గనిశెట్టి పిలుపునిచ్చారు. సమ్మె పోస్టర్ను సోమవారం లంకెలపాలెం జంక్షన్ లో ఆటో యూనియన్ నాయకులతో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఖాతా. వెంకటస్వామి, ఈ నర్సింగరావు, విరోధి ఠాగూర్, మధు, నర్సింగరావు రమణ శ్రీను తదితరులుపాల్గొన్నారు
Views: 0


