ప్రభాస్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్లు!
- 'స్పిరిట్'కు సన్నాహాలు ప్రారంభం.. 300 కోట్లతో సినిమా రూపొందనుంది
- డిసెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.. తెరపైకి కియారా - నయన్ పేర్లు
ప్రభాస్ హీరోగా ఓ వైపు 'కల్కి', మరోవైపు 'రాజా సాబ్' చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ సినిమాల్లో ప్రభాస్ పోర్షన్ షూటింగ్ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. డిసెంబర్ నుంచి ‘స్పిరిట్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. ఒక కథానాయిక పాత్ర కోసం కియారా అద్వానీని, మరో మహిళా ప్రధాన పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నారు. నిజంగా ఈ రెండింటిని తీసుకుంటే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయని చెప్పాలి.
కియారాకు దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ‘జవాన్’ సినిమాతో అక్కడ నయనతార మార్కెట్ ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 300 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
Post Comment