Modi : నీతివంతమైన పాలనకు నిదర్శనం ప్రధాని మోదీ

గుండ్లపోచంపల్లి బీజేపీ ప్రచారంలో ఈటల సతీమణి జామున

  • ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అనేక పథకాలను అమలు చేసిందని అలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలు బీజేపీ కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల జామున తెలిపారు.

Modi : నీతివంతమైన పాలనకు నిదర్శనం ప్రధాని మోదీ

జయభేరి, మేడ్చల్ : 
ఒక్క అవినీతి మచ్చలేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనను చూసి ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జామున అన్నారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని ఈటల కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఈటల జామున మాట్లాడుతూ నరేంద్రమోదీ 10 సంవత్సరాల పాలనలో ఒక్క అవినీతి మచ్చలేకుండా పాలన సాగించిన గొప్ప నాయకుడు నరేంద్రమోదీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అనేక పథకాలను అమలు చేసిందని అలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలు బీజేపీ కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల జామున తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అమరం సరస్వతి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ కిషన్, జిల్లా బిజెవైఎం అధికార ప్రతినిధి కావేరి శ్రీధర్, నాయకులు జె.కృష్ణా, సుంకు నవీన్,వినోద్, అభిలాశ్, నవనిత, భారతి,స్ట్రేలింగ్ హోమ్స్ వాసులు గోపాల్, పంకాజ్, వీరారెడ్డి, లింగారెడ్డి, రాజేంద్రప్రసాద్, ప్రతాప్, సుభాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం