అమ్మా బైలెళ్లినాదో.. తల్లీ బైలెల్లినాదో

  • గుండ్లపోచంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలు
  • అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మహిళల బోనాల సమర్పణ..

అమ్మా బైలెళ్లినాదో.. తల్లీ బైలెల్లినాదో

మేడ్చల్..
తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని ప్రతిభింబిస్తూ జరుపుకునే పండుగల్లో బోనాల పండుగకు ప్రత్యేక విశిష్టత ఉందని గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఆషాడ మసా బోనాల వేడుకలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ మాసాంలో గ్రామ దేవతలకు మహిళలు నైవేద్యంగా బోనం సమర్పస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితి తెలంగాణా సంస్కృతిలో వందల సంవత్సరాల నుండి వస్తుందన్నారు. ఈ ఏడూ ఎటువంటి ప్రకృతి విపత్తు రాకుండా ప్రజలపై అమ్మవారు చల్లని చూపు చూపాలని, వర్షాలు సంవృద్దిగా కురిసి పడిపంటలతో సుఖశాంతులతో ప్రజలు జీవించే విధంగా అమ్మవారు దివించాలని కోరుకునట్లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భేరి బాలరాజు, అమరం జైపాల్ రెడ్డి, అమరం హేమంత్ రెడ్డి, నాయకులు సురేందర్ గౌడ్, నర్సింగరావు, సురేష్, హరిబాబు, రమేష్, మహేష్, లక్ష్మణ్, ప్రభాకర్, కిరణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

94ea494c-3fc2-4a47-9fcd-5b01f727ac77

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
మున్సిపాలిటీ పరిదిలోని ఎస్సి కాలనీలో ఆదివారం జరిగిన బోనాల పండుగ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కాలనీలోని మహిళలంతా ఒక్కటై బోనాలను ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో డప్పువాయిద్యాల మధ్య ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు బోనాలు నైవేద్యాలను సమర్పించి పూజలు చేశారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ