విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వరంజిత్ అనే చిరు వ్యాపారి గజ్వేల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు ప్రక్కన పానీ పూరీ బండి నడుపుతూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో నుండి తన పానీ పూరీ బండికి విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకుని బల్బ్ వెలిగించుకున్నాడు. 

తన బండి సమీపంలో పానీ పూరీకి సంబంధించిన పనిమూట్లను నీళ్లతో శుభ్రపర్చుకోగా నేల మొత్తం తడిసిపోయింది. పానీ పూరీ బండికి వస్తున్న విద్యుత్ సరఫరాను ఆపివేయకుండానే తడిసిన నేలపై నిలబడి తడిసిన చేతులతోనే ప్లగ్ తీయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Read More అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా

Latest News