Chief Ministers : ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాటు పండుగ వాతావరణంలో నిర్వహించండి

కలెక్టర్ ప్రవీణ్ కుమార్

ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Chief Ministers : ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాటు పండుగ వాతావరణంలో నిర్వహించండి

జయభేరి, తిరుపతి :
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రతి నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవ విజయవాడ సభకు మోబిలైజ్ చేయాలని, ప్రత్యక్ష ప్రసార వీక్షణకు పండుగ వాతావరణంలో ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.

సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేపట్టాల్సిన పలు అంశాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీక్షించి ఆర్డీఓలు, డివిజన్, నియోజక వర్గ, మునిసిపల్, మండల తహశీల్దార్, ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్, తదితర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

Read More మద్యం ధరలపై ఏపీలో చట్ట సవరణ..

 97 (1)

Read More రైతు, కార్మికుల సమస్యలపై దేశ వ్యాప్త ఆందోళన జయప్రదం చెయ్యండి 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకొరకు మండల కార్యస్థాన తహశీల్దార్, ఎంపిడిఓలు బాధ్యతగా సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పంపాల్సి ఉంటుంది అని తెలిపారు. 

Read More బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్

ప్రతి బస్ కు ఒక నోడల్ అధికారి ఏర్పాటుతో బాధ్యతగా వారిని రేపు మంగళవారం ఉదయం తీసుకుని బయల్దేరి సాయంత్రం 5 గం.లకు సూచించిన ట్రాన్సిట్ పాయింట్ వద్ద వెళ్ళాలని రాత్రి బస ఏర్పాటు ఉంటుందని, అనంతరం మరుసటి దినం ఉదయం బుధవారం జూన్12న ఆం.ప్ర సిఎం ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి వారిని తీసుకు వెళ్లి అనంతరం జాగ్రత్తగా వారిని తిరిగి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. త్రాగునీరు తదితర ఏర్పాట్లు సదరు నోడల్ అధికారి బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. బస్సుకు ఫ్లెక్సీ ఏర్పాటు ఉండాలని తెలిపారు.

Read More ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు

Social Links

Related Posts

Post Comment