జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో, మార్చ్ 17 :
కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం గొట్టిముక్కుల భిక్నూర్ మండలం లక్ష్మి దేవనపల్లి అంతంపల్లి రామేశ్వరం పల్లి, జంగంపల్లి రాజంపేట మండలం తలమడ్ల, ఆరేపల్లి, పెద్దయిపల్లి, రాజంపేట, కామారెడ్డి మండలం పాత రాజంపేట, నరసన్న పల్లి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు భరోసా కల్పించిన ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అకాల వర్షాలు వడగళ్ల వాన తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.రైతులు పండించిన వరి, మొక్కజొన్న, పసుపు,మిర్చి, మామిడి, పంటలు నేలపాలైపోయినాయి. రైతులు అధైర్య పడవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం పంట నష్టపోయిన ప్రాంతాలలో అధికారులను పంపించి నష్టపోయిన పంటల నివేదికలు తెప్పించుకొని రైతులందరికీ ఆదుకుంటాం వారికి న్యాయం చేస్తాం ప్రభుత్వం బాధ్యతాయితంగా వ్యవహరించి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసుకుంటాం తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం రైతులకు ఏలాంటి పంట నష్టం అందించలేదు గత ప్రభుత్వాలు రైతులకు రైతు బీమా అందించి వారి ఆత్మహత్యలకు పురిగొల్పింది రైతులకు కావలసింది పంట బీమా అది అందించే ప్రయత్నం చేస్తాం. పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తాను అన్నారు. 
గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో కలసిపంట నష్టం పై నివేదికలు అందించాలి. రైతులకు మనో ధైర్యం కల్పించాలి. ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు, భీమ్ రెడ్డి, గాల్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, కుంట లింగారెడ్డి, యాదవ రెడ్డి, కృష్ణారావు, అంకం రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి. గణేష్ నాయక్, సుతారి రమేష్. నౌసినాయక్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.