ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

తూoకుంట మున్సిపాలిటీలో కొనసాగిన యాత్ర.. ప్రభుత్వ పథకాలను ఆటపాటల ద్వారా ప్రజలకు వివరిస్తున్న కళాకారులు

ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

జయభేరి, నవంబర్ 23:
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు - 2024 లో సందర్భంగా ప్రజా పాలన కళాయాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆటపాటల రూపంలో ప్రజలకు తెలియచేస్తున్నారు. 

ఈ కళాయాత్ర తూoకుంట మున్సిపల్ పరిధిలోని  శామీర్ పేట, బాబాగుడ, బొమ్మరాశీపేట, మీదుగా దుందిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట, బౌరంపేట, శంభిపూర్ , లలో కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆటపాటల రూపంలో ప్రజలకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో దుండిగల్  మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, మేనేజర్ సునంద, రామచందర్ , రవీందర్ రెడ్డి, పెంటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

WhatsApp Image 2024-11-24 at 06.40.33(1)

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

Views: 1