నకిలీ మందులు విత్తనాలు విక్రయిస్తే ఊరుకునేది లేదు
ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి రాధిక
జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24 :
నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం వర్గల్ మండల కేంద్రంలోని వివిధ ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాములను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల యజమానులు వ్యవహరించవద్దని, రికార్డులు సరిగా మైంటైన్ చేయడంతో పాటు నిర్ణయించిన ధరలకే రైతులకు విక్రయించి బిల్లులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు.
Views: 0


