మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

జయభేరి, గజ్వెల్, నవంబర్ 23 : 
కాంగ్రెస్ గ్యారంటీల మోసానికి మరాఠ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు,  మనోహర్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అని మరాఠీ ప్రజలు మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకున్నారని హర్షం వ్యక్తం చేసారు. మహారాష్ట్ర బీజేపీ విజయం సాధించడం పట్ల శనివారం భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తా లో సంబురాలు నిర్వహించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ మహారాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందన్న అబద్దపు ప్రచారం చేసి కుట్ర చేసిన కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నా రు. దీన్ని ఈవీఎంల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణపై కూడా ప్రభావం చూపుతాయిన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మిఠాయి పంచుకొని, టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలొ గజ్వెల్ బీజేపీ నాయకులు సందీప్ కుమార్, చెప్పాలా వెంకటరెడ్డి, నరసింహ,దయాకర్ రెడ్డి, హరి, గుల్ల వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More పాములపర్తి వెంకట నర్సింహా రావు 104వ జయంతి వేడుకలు