Telangana : రసాభాసగా కాంగ్రెస్ పార్టీ సమావేశం
మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది.
జయభేరి, మేడ్చల్ :
మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. శనివారం మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ జంగయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవలే మేడ్చల్ మున్సిపల్ చెందిన పదిమంది మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Views: 0


