పరకాల ఏజీపీగా లక్కం శంకర్

శంకర్ ను సన్మానించిన ఎమ్మెల్యే 

పరకాల ఏజీపీగా లక్కం శంకర్

జయభేరి, పరకాల, డిసెంబర్ 04: 
పరకాల పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది లక్కం శంకర్ ను పరకాల ఏజీపీగా నియమిస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి నియామక పత్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు లక్కం శంకర్ కి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా అందుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి  మాట్లాడుతూ కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు గౌరవం ఇస్తుందని అన్నారు. ఏజిపిగా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకొని పేదలకు న్యాయం అందిస్తూ సమాజంలో మంచి గౌరవం పొందాలని లక్కం శంకర్ కు సూచించారు. అనంతరం ఏజిపి లక్కం శంకర్ కి ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి  శాలువా కప్పి సత్కరించారు.

Read More చింతపల్లిలో రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు

Latest News