ఇస్కాన్ టెంపుల్ పూరి జగన్నాథ (కృష్ణ) రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్లు, కరపత్రంలు ఆవిష్కరించి పంచడం జరిగినది... దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామము నుండి శ్రీకృష్ణ రథయాత్రకు భక్తులను అధిక సంఖ్యలో తరలిరావాలని అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు కొనియాడారు.

ఇస్కాన్ టెంపుల్ పూరి జగన్నాథ (కృష్ణ) రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

జయభేరి, దేవరకొండ :
పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ రథయాత్ర జూలై 10 వ తారీకు మన దేవరకొండ కు రానున్నడంతో రథయాత్రను విజయవంతం చేయడం కోసం సోమవారం స్థానిక వాసవి కళ్యాణ మండపంలో కమిటీ సమావేశం  ఏర్పాటు చేయడం జరిగినది.
 
ఈ కార్యక్రమంలో పోస్టర్లు, కరపత్రంలు ఆవిష్కరించి పంచడం జరిగినది... దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామము నుండి శ్రీకృష్ణ రథయాత్రకు భక్తులను అధిక సంఖ్యలో తరలిరావాలని అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు కొనియాడారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు   మాట్లాడుతూ రథయాత్ర నిర్వహణ ఏర్పాట్లు చందాల పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీలకు రసీదు పుస్తకాలను అందించారు. అదేవిధంగా ఈ పూరి జగన్నాథ రథయాత్రలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని  కోలాటాలు మరియు వివిధ నృత్యాలతో కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కార్యదర్శి నక్క వెంకటేష్ యాదవ్, కోశాధికారి పెండ్కర్ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, తాడిశెట్టి సుదర్శన్, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు, నీల సంజీవ్ కుమార్, షిరిడి సాయిబాబా దేవాలయం అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్,  ఉప్పల శ్రీనివాసులు (చంటి) సిరిపోతు శ్రీరాములు, మహిళా కమిటీ చైర్మన్ చేరుపల్లి జయలక్ష్మి, కో చైర్మన్ గోవిందు శైలజ, అధ్యక్షులు గుమ్మడవెల్లి మహాలక్ష్మి, కార్యదర్శి మోర శ్రీదేవి, కోశాధికారి  బెలిదే మాధవి, పంగునూరు లింగయ్య, సముద్రాల ప్రభాకర్, కర్నాటి జనార్ధన్, శీల ధర్మయ్య ఎన్ ఎన్ చారి, నేతల వెంకటేష్ యాదవ్, కొత్త సుబ్బారావు, చీదర్ల శ్రీదేవి, చిలువేరు ముత్తమ్మ గార్లపాటి రజిని, శీల ధనలక్ష్మి సముద్రాల రేణుక, కుంచకూరి శిరీష, తదితరులు పాల్గొన్నారు.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన