ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల లోను అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1నుండి 19ఏళ్ళ వయసు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ కై ఆల్బెండజోల్ 400ఎం జి మాత్రలను పంపిణీ చేశామని రాజోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు తెలిపారు.

ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం లో భాగంగా గురువారం రాజోలి మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల లోను అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1నుండి 19ఏళ్ళ వయసు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ కై ఆల్బెండజోల్ 400ఎం జి మాత్రలను పంపిణీ చేశామని రాజోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులు రాకుండా తగిన ఆహార నియమాలను పాటిస్తే వాటిని నివారించవచ్చని ఆయన ఆన్నారు. తేనే, వెల్లుల్లి, దానిమ్మ పండ్లు, క్యారెట్ వంటి ఆహారం తీసుకుంటే కడుపులోని నులిపురుగులను తగ్గించడం లో సాయపడుతాయని చెప్పారు. పీచు పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవాలని అన్నారు.

కడుపు లో ఉన్న బద్దె పురుగులు, ఏలిక పాము వంటి నులిపురుగులు ఆహార నియమాలు పాటిస్తే మలం ద్వారా అవి పడిపోతాయని ఆయన ఆన్నారు. విటమిన్ సి, జింక్ వంటి పోషాహారం ఎక్కువగా తీసుకోవాలి అని తెలిపారు. చేతి గోళ్లను కత్తిరించి, సబ్ తో చేతులను కడుగుకోవాలి. బహిరంగ ప్రదేశాలు లో మలవిసర్జన చేయకూడదని జాగ్రత్త లు చెప్పారు. ఆల్బండ జోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం లో రాజోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాశ్, సూపర్వైజర్లు, ఏ ఎన్ ఎమ్ లు, ఆశా లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు