టిటిడి బోర్డ్ సభ్యులు మహేందర్ రెడ్డి ఎన్నికవడం పట్ల హర్షం

మహేందర్ రెడ్డికి ఆశీర్వాదం అందించిన కీసర మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ శర్మ, నాయకులు

టిటిడి బోర్డ్ సభ్యులు మహేందర్ రెడ్డి ఎన్నికవడం పట్ల హర్షం

జయభేరి, నవంబర్ 23:
తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సభ్యునిగా ఎన్నికైన మహేందర్ రెడ్డిని కీసర మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ శర్మ, కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, లు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మహేందర్ రెడ్డికి మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ శర్మ , వేద పండితులు కలిసి ఆశీర్వాదం అందించారు. మహేందర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ సభ్యునిగా ఎన్నికవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైరాం, శ్రీధర్ రెడ్డి, రమేష్, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0