80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన ఘనత కాంగ్రెస్ దే : నితిన్ గడ్కరీ
న్యూ డిల్లీ ఏప్రిల్ 17:
రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
పదేళ్ల సంవత్సరాల పని మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తుంది. బీజేపీతో పాటు శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ కలిగి ఉండడం ఎన్డీఏ బలాన్ని పెంచుతుందన్నారు. శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చాలా మంది ఏకనాథ్ షిండే వెంట ఉన్నారని.. సహజంగా అదే నిజమైన శివసేన అన్నారు. ఈ సారి బారామతిలో కూడా ఎన్డీయే గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు అంటున్నాయని.. ఇందులో తాము జోక్యం చేసుకోమని.. ఏజెన్సీలు తమపని చేస్తున్నాయన్నారు.
Post Comment