జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..
కేంద్రాన్ని కోరిన ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
జయభేరి, న్యూఢిల్లీ దేశంలో జర్నలిస్టుల భద్రత రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు బెదిరింపు లపై ప్రెస్ కౌన్సిల్ సభ్యులు గుర్బీర్సింగ్ రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది.
అందులో మొదటిది.. దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటించటం. అలాగే, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్కు మరిన్ని అధికారాలు కలిగించాలనీ, ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించటం చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది..
Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ
Views: 0


