ఎల్పీజీ కంపెనీలు మొదలు పెట్టిన ఈకేవైసీ ప్రక్రియ
ఈకేవైసీ ప్రక్రియకు ఇంకా గడువును ప్రకటించలేదు - కేంద్ర మంత్రి
గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు. అంతేగాక దీని నమోదుకు ఎలాంటి తుది గడువు విధించలేదని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు సంస్థలు గానీ.. కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి తుది గడువు విధించలేదని హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఎల్పీజీ ఏజెన్సీల్లోనే కచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధనేదీ లేదని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించబోవని తెలిపారు.
Views: 0


